27 June, 2026 | 2:21 PM

Breaking News

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •  

కార్మికులపై వేధింపులను నివారించాలి

06-10-2024 12:51 AM

ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమూద్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీలో కార్మికులపై వేధింపులు, పెరుగుతున్న పనిభారాన్ని నివారించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ (ఐఎన్‌టీయూసీ) యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ డిమాండ్ చేశారు.

నగరంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆర్టీసీలో 55 రోజుల సమ్మె సందర్భంగా అమరులైన 32 మంది కార్మికులకు టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీ అనేక ఆర్థిక ఇబ్బందులతో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

ఈ సంక్షో భం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలన్నారు. ఇప్పటికీ కొంతమంది కార్మికులకు బాండ్ డబ్బులు చెల్లింలేదని వెంటనే చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాల న్నారు.  యూనియన్ నాయకులు రాజిరెడ్డి, అబ్రహాం, జక్కుల మల్లేశ్  పాల్గొన్నారు.