28-06-2025 01:52:58 PM
హైదరాబాద్: జాబ్ క్యాలెండర్(Telangana Job Calendar) ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Former Minister Tanniru Harish Rao) అన్నారు. డబ్బులు ఖర్చు చేసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. నోటిఫికేషన్లు వద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అబద్ధమన్నారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
చలో సచివాలయం(Chalo Secretariat) కార్యక్రమానికి మద్దతివ్వాలని నిరుద్యోగ యువత కోరారని హరీశ్ రావు తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత పోరాటాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పాలనలో 1.62 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. దగా క్యాలెండర్ తో నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు. నోటిఫికేషన్లు వద్దని యువత ధర్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి దృష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్(Priyanka Gandhi Youth Declaration) ప్రకటించారు, బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. కమీషన్లు రావని రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదా? అని హరీశ్ రావు(Harish Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.