calender_icon.png 9 June, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు

09-06-2025 09:53:39 AM

హైదరాబాద్: మాజీ నీటిపారుదలశాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) నేడు కాళేశ్వరం కమిషన్( Kaleshwaram Commission) ముందు విచారణకు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 11:30 గటలకు హరీశ్ రావు విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) విచారణ చేస్తోంది. విధానపర నిర్ణయాలు, ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నించే అవకాశముంది. మేడిగడ్డ, అన్నాం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అవకతవకలపై విచారించనున్నారు. హరీశ్ రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం రీ-డిజైన్ జరిగింది. ఇప్పటికే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరుల విచారణ పూర్తి అయింది.