calender_icon.png 9 June, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు

09-06-2025 11:36:44 AM

హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హరీశ్ రావు(Harish Rao) హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో హరీశ్ రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నిస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణలో చేస్తుంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విధాన, ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ హరీశ్ రావును ప్రశ్నిస్తుంది. విచారణకు వెళ్ళేముందు తెలంగాణ భవన్ లో నేతలతో హరీశ్ రావు చర్చించారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌కే భవన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో హరీష్ రావు వెంట  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు.