వేములవాడలో కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్
20-05-2026 12:13 AM
వేములవాడ, మే 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ను బస్తీ దవాఖానలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార బాలికలకు అనీమియా, డయాబెటిస్, బీఎంఐ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బాలికలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏఓ ఫసత్ అలీబేగ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నయీం, సీడీపీఓ సౌందర్య, టీఎంసీ భూలక్ష్మీ, బస్తీ దవాఖాన వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, మెప్మా సిఎల్ఆర్పీలు, ఆర్పీలు పాల్గొన్నారు.






