20-06-2025 12:04:12 AM
యోగా శిక్షకులు శ్రీనివాస్, ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు
రాజన్న సిరిసిల్ల: జూన్ -19 (విజయక్రాంతి): నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయు ష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ శ్రీనివాస్ టీ స్వప్న పేర్కొన్నారు.అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఉదయం కామన్ యోగా ప్రోటోకాల్ పై జిల్లా అధికారులు, సిబ్బందికి ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్ టి స్వప్న యోగ ఆసనాల పై అవగాహనకల్పించారు.
ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ.చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులుపాల్గొన్నారు.