24 March, 2026 | 8:14 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

హెజ్‌బొల్లా కొత్త చీఫ్ ఎక్కువ కాలం ఉండడు

31-10-2024 02:20 AM

ఇజ్రాయెల్ రక్షణమంత్రి 

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఇజ్రాయెల్ వరుసదాడులతో హెజ్‌బొల్లా, హమా స్ అగ్రనేతలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయీం ఖాసీం నియమితులయ్యారు. దీనిపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. షేక్ ఖాసీం ఫొటోను షేర్ చేసిన గాలంట్ ‘ఇది తాత్కాలిక నియామకమే. సుదీర్ఘకాలానికి కాదు’ అని పేర్కొన్నారు. దీంతో వచ్చే రోజుల్లో ఖాసీంను టార్గెట్ చేసి ఐడీఎఫ్ భీకరదాడులు చేయొచ్చని సంకేతాలిచ్చారు. బీరుట్‌లోని దాహియా ప్రాంతంలో ఉన్న హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇటీవల మృతిచెందాడు. నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా కొత్త చీఫ్ ఎవరన్న దానిపై చర్చ జరగగా.. ఆ మిలిటెంట్ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఖాసీంను ఎన్నుకున్నారు.