calender_icon.png 21 June, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వీడియోల కేసుపై హైకోర్టులో విచారణ

21-06-2025 01:17:16 AM

కేటీఆర్, జగదీశ్‌రెడ్డి క్వాష్ పిటిషన్లపై తీర్పు వాయిదా

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన నకిలీ వీడియోల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 2024 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న ఫిర్యా దు ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో నకిలీ వీడియోలను సృష్టించి ప్రచారం చేశారని ఫిర్యాదులో పే ర్కొన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..

వారిద్దరిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. కేసును కొట్టివేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న తరఫున న్యాయవాది వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది.