21-06-2025 01:15:43 AM
గచ్చిబౌలి బ్రాంచీలో ఏటీఎం ప్రారంభం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ప్రముఖ మల్టీ-స్టేట్ షెడ్యూల్ బ్యాంక్ అయిన మహేష్ కో -ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ శుక్రవారం గచ్చిబౌలిలోని బ్రాంచీలో కస్టమర్ల భద్రతా లావాదేవీల కోసం మరిన్ని భద్రతా లక్షణాలతో అప్గ్రేడ్ చేసిన ఏటీఎంను ఏర్పాటు చేసింది. బ్యాంకు డైరెక్టర్ కైలాష్ నారాయణ్ బి, ఎండీ, సీఈఓ వి అరవింద్ అనేక మంది కస్టమర్ల సమక్షంలో కొత్త ఏటీఎంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కస్టమర్ల సౌలభ్యం, భద్రత కోసం అధిక నాణ్యత గల ఏటీఎంలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 1978 ఆగస్టు 9 నుంచి మహేష్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిందని, బేగం బజార్ మొదటి శాఖగా ఉందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 45 శాఖలు ఉన్నాయని తెలిపారు. 2028 నాటికి 50వ స్వర్ణోత్సవ వేడుకల సంవత్సరం నాటికి మరో 5 శాఖలను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.