16 March, 2026 | 10:46 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రెకార్డులను తాకి ఫ్లాట్‌గా ముగింపు

30-07-2024 01:57 AM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సరికొత్త రికార్డులను తాకి చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బ్యాంకింగ్, ఎల్‌అండ్ టీ షేర్ల అండతో ఉదయం దూసుకెళ్లిన సూచీలు.. ఇంట్రాడేలో సరికొత్త జీవనకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 81,908 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,999.75 పాయింట్ల వద్ద ఆల్టైమ్ గరిష్టాలను తాకాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఫాట్‌గ్గా గా చివరికి ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో శనివరం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దీంతో దేశీయ మార్కెట్లు కూడా లాభాలతో మొదలయ్యాయి.

సెన్సెక్స్ ఉదయం 81,679 పాయింట్ల (క్రితం ముగింపు 81,332.72) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,135.91 - 81,908.43 మధ్య కదలాడింది. అంటే ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడింది. అయితే   మదుపరులు లాభాల స్వీకరణతో చివరికి 23.12 పా యింట్ల లాభంతో 81,355.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.25 పాయింట్స్ లాభపడి 24,836.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.74గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్ టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీం ద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు లాభపడగా.. టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.26 డాలర్లు, బంగారం ఔన్సు 2391 డాలర్లు చొప్పున ట్రేడవుతున్నాయి.