11 May, 2026 | 11:56 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

‘పట్టు’ అదిరింది

23-08-2024 12:00 AM

 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన క్రీడాకారిణులు

 ముగ్గురికి బంగారు పతకాలు

అమ్మన్ (జోర్డాన్): అండర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత క్రీడాకారులు నేహ, అదితికుమారి, పులకిత్ బంగారు పతకాలను గెలుచుకున్నారు. మహిళల 57 కేజీల ఫ్రీ స్టుల్ విభాగంలో నేహ బంగారు పతకం కైవసం చేసుకుంది. జపాన్ క్రీడాకారిణితో జరిగిన ఫైనల్ పోరులో నేహ 10 తేడాతో గెలిచింది. ఇక మహిళల 43 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో భారత్‌కే చెందిన అదితి కుమారి కూడా బంగారు పతకం గెల్చుకుంది.  ఫైనల్ బౌట్‌లో అదితి గ్రీస్ క్రీడాకారిణిపై విజయం సాధించింది. ఇక 65 కేజీల విభాగం ఫైనల్ పోరులో పులకిత్ 6 తేడాతో డారియా మీద విజయం సాధించింది. మానసి లాథర్ కూడా 73 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మానసి హన్నాతో పోటీ పడనుంది. అంతే కాకుండా ఇండియా రెండు కాంస్య పతకాలను కూడా గెలుచుకుంది. రోనాక్ దహియా, సాయినాథ్ పార్థి కాంస్యాలు గెలుచుకున్నారు.