రెజ్లింగ్లో భారత్కు నాలుగు స్వర్ణాలు
అమ్మన్ (జోర్డాన్): అండర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. మహిళల విభాగంలో నేహ, అదితికుమారి, పులకిత్, మాన్సి లాథర్ స్వర్ణ పతకాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. 57 కేజీల ఫ్రీ స్టుల్ విభాగంలో నేహ 10 తేడాతో సుయి (జపాన్)పై విజయం సాధించింది. మహిళల 43 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో అదితి కుమారి పసిడి సొంతం చేసుకుంది.
ఫైనల్లో అదితి 7 గ్రీస్కు చెందిన మరియాను చిత్తు చేసింది. ఇక 65 కేజీల విభాగం ఫైనల్లో డారియాను ఎదుర్కొన్న పులకిత్ 6 తేడాతో విజయం సాధించింది. 73 కేజీల విభాగం ఫైనల్లో మాన్సి లాథర్ రష్యాకు చెందిన హన్నా పిర్సక్యాపై విజయాన్ని సాధించి స్వర్ణం పతకం కొల్లగొట్టింది. ఇక పురుషుల విభాగంలో రోనక్ దహియా (110 కేజీలు), సాయినాథ్ (51 కేజీలు) కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.






