29 April, 2026 | 9:52 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఘనంగా సంకల్ప సభ నిర్వహణ

18-06-2025 10:18 PM

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్స్ గురుమూర్తి శివకుమార్..

హనుమకొండ (విజయక్రాంతి): మండల అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం సంకల్ప సభలో ప్రారంభంగా మొక్కలు నాటిన అనంతరం, పార్టీ బలోపేతం, రచ్చబండ కార్యక్రమాలపై అవగాహన, యోగా దినోత్సవం, వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ముఖ్య అతిథులు వర్ధన్నపేట నియోజకవర్గ కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి(Constituency Convener Muthireddy Kesava Reddy), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రచ్చబండ కార్యక్రమాల ప్రాముఖ్యతను, 11 సంవత్సరాల మోడీ పరిపాలన గురించి వివరించారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ పార్టీ బలోపేతంపై కీలకంగా ప్రసంగించారు. అనంతరం వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞను అందరూ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్ల పెళ్లి కుమారస్వామి, రైల్వే బోర్డు మెంబర్ తాళ్ల శ్యామ్, మాజీ ఎంపిటిసి పిట్టలకు కుమారస్వామి, నాయకులు జీల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్ రావు, మండల ఉపాధ్యక్షులు బలగాని రవీందర్ గౌడ్, భోగి సుజాత, ప్రధాన కార్యదర్శి చల్పూరి శంకర్, కార్యదర్శులు దాది మధుసూదన్, దాట్ల సునీల్, వెంగాల శ్రీనివాస్, మహిళా మోర్చా నాయకులు పబ్బు ఉమాదేవి, పార్టీ కార్యకర్తలు తిప్పన్న, రాజేందర్, గడిపి సుమన్, అశోక్, కుంభకర్ సాయి, మండల కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.