calender_icon.png 19 June, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతు సంక్షేమ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

18-06-2025 10:14:46 PM

ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్(Additional Collector Narayan Amit) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన "జంతువులపై క్రూరత్వ నివారణ" జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జంతు సంరక్షణకు జంతు హింస నివారణ కమిటీ ద్వారా సొసైటీలను ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలలోని స్లాటర్ హౌస్ లను నిరంతరం తనిఖీ చేయాలని, ముఖ్యంగా జంతువుల రవాణా సమయంలో అనుమతి ఉందో లేదో తనిఖీ చేయాలని, జంతువులకు హాని కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించకూడదని, ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తే రాజ్యాంగ ప్రకారం శిక్షార్హులని తెలిపారు. 

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల సంతతిని తగ్గించేందుకు ఆడ కుక్కలకు టీకాలు వేయాలని, జంతువులకు కావాల్సిన ఆహారం ,మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గోశాల నిర్వాహకులు జంతువుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని, పక్షులకు తాగునీటిని ఏర్పాటు చేయాలని, వాటి ఆవాసాలైన వృక్షాలను ఎట్టి పరిస్థితులలో నరకవద్దని, అలాగే పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగనిరోధక టీకాలు ఇప్పించాలని, వీది కుక్కలను చంపకూడదని, ఇతర ప్రాంతాలకు తరలించాలని, జంతు హింస చట్టరీత్యా నేరమని చెప్పారు. అడిషనల్ ఎస్పీ రమేష్, జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జివి రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు మాట్లాడుతూ.. జంతు సంరక్షణకై తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు.