18-06-2025 10:22:08 PM
ఆటో నుంచి జారిపడి విద్యార్థి మృతి..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): క్షేమంగా ఇంటికి చేర్చే స్కూల్ ఆటోనే ఆ విద్యార్థిని బలి తీసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శుభాష్ నగర్ కి చెందిన రియాహన్ రాజా(5) స్థానిక ప్రైవేటు స్కూల్ ల్లో 1వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుండి ఇంటికి స్కూల్ ఆటోలో సుభాష్ నగర్ చేరుకున్నాడు.
ఆటోకు అడ్డంగా పందులు రావడంతో ఆటో డ్రైవర్ వాటిని తప్పించే ప్రయత్నంలో వెనక కూర్చున్న విద్యార్థి ఆటో నుంచి జారిపడ్డాడు. వెనుక టైర్ కింద పడి పడిపోయాడు. ఆటో నుంచి జారిపడిన విద్యార్థిని డ్రైవర్ గమనించకపోవడంతో ఆటో వెనక టైరు కిందపడిన విద్యార్థి తలపైకి ఆటోవెనుక టైరు ఎక్కితలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే బస్తీవాసులు గాయపడిన విద్యార్థిని బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రికి హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందాడు.