17 April, 2026 | 2:10 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

బదిలీపై వెళుతున్న డీ.జీ.ఎం పర్సనల్ జీ.వి మోహన్ రావుకు సన్మానం

15-06-2025 09:36 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్(పర్సనల్) గా పనిచేసి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వెళుతున్న జీ.వి మోహన్ రావును జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య(General Manager V. Krishnaiah), ఇతర అధికారులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వి కృష్ణయ్య మాట్లాడుతూ... జీ.వి మోహన్ రావు గత నాలుగు సంవత్సరాలుగా ఇల్లందు ఏరియాలో పని చేసి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కొత్తగూడెం ఏరియాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే ఎస్ .టి. పి. పి శ్రీరాంపూర్ ఏరియా నుండి ఇల్లందు ఏరియాకు బదిలీపై వచ్చిన డిప్యూటీ జనరల్ పర్సనల్ అజ్మీర తుకారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం రామస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.