15-06-2025 10:03:45 PM
మోతె: ఆదివారం మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు భూక్యా శంకర్ నాయక్(BJP Mandal Party President Bhukya Shankar Nayak) ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) 66వ పుట్టిన రోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ... దేశానికి బిజెపి ప్రభుత్వమే శ్రీ రామ రక్ష లాగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనిచేయడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంతో ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రామ చంద్రయ్య, వెంకన్న, ధర్మారెడ్డి, శ్రీనివాస్, కళ్యాణ్, మండల జనరల్ సెక్రెటరీ పెరుగు మధు యాదవ్ , మండల ఎస్టీ సేల్ అధ్యక్షుడు సైదా నాయక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.