శవాన్ని గ్రామానికి తరలించేదెలా?
- ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతూ గిరిజనుడి మృతి
- శవాన్ని స్వగ్రామం తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడిన కుటుంబ సభ్యులు
- క్టర్లో శవాన్ని ఉంచి వాగు దాటించిన వైనం
ఆదిలాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి): ఆ గ్రామానికి చెందినవారు ఎవరైనా చనిపోతే ఆసుపత్రి నుంచి శవాన్ని గ్రామానికి తీసుకెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం చందూరి గ్రామం పంచాయతీ అనుబంధ గ్రామం రాజులుగూడకు చెందిన చహకటి చీత్రు కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో చీత్రు గురువారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఆదిలాబాద్ నుంచి చీత్రు సగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడ్డారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తుండగా భారీ వర్షం కురవడంతో గ్రామ శివారులోని వాగు ఉధృతిగా ప్రవహించింది. మృతదేహంతో చాలాసేపు వేచి ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గకపోవడంతో చివరకు ఓ ట్రాక్టర్లో మృతదేహాన్ని ఉంచి అతికష్టం మీద వాగు దాటించాల్సి వచ్చింది.






