9 May, 2026 | 5:34 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

ఆటోను ఢీకొట్టిన లారీ

16-08-2024 01:57 AM
  1. ఇద్దరి మృతి, 14 మందికి గాయాలు 
  2. గద్వాల జిల్లా అలంపూర్‌లో ఘటన

అలంపూర్, ఆగస్టు 15: కూలీపనుల నిమిత్తం ఆటోలో వెళ్తున్న ఆ అభాగ్యులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. ఏపిలోని కర్నూల్ జిల్లా తాండ్రపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు గురువారం గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం కండుపాడు గ్రామానికి  ఆటోలో కూలిపనుల నిమిత్తం వెళ్తుండగా.. ఓ లారీ అతివేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు.. సుజాత (35), రమాదేవి (30) అక్కడికక్కడే మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు.