calender_icon.png 6 October, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

05-02-2025 01:16:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలో భారీగా డ్రగ్స్‌ను బుధవారం  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.60 కోట్ల విలువైన 1300 గ్రాముల ఏండీఎంఏను సీజ్ చేసి డ్రగ్స్ విక్రయించేందుు ప్రయత్నించిన ముగ్గురు విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌తో కలిసి లంగర్‌ హౌస్‌, హుమాయున్‌ నగర్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాలు ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని నార్కోటిక్‌ బ్యూరో, పోలీసులు ప్రజలకు సూచించారు. డ్రగ్స్ కేసులో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు తెలిపారు.