15 March, 2026 | 9:02 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

14-07-2024 05:37 AM
  • రెండు కార్లలో 1.40 క్వింటాళ్లు స్వాధీనం 
  • పోలీసుల అదుపులో సూర్యాపేట యువకుడు 
  • పరారీలో మరో నలుగురు నిందితులు

నల్లగొండ, జూలై 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. రెండు కార్ల లో తరలిస్తున్న 140.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుడిని సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలానికి చెందిన భూక్యా రాముగా గుర్తించారు. మిర్యాలగూడ నుంచి గం జాయి తరలిస్తున్నట్టు శనివారం మధ్యా హ్నం పోలీసులకు పక్కా సమాచారంతో పట్టణ శివారులో డీఎస్పీ రాజశేఖర్ రాజు సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న మహేంద్ర బొలెరో, మోరాజో వాహనాలను తనిఖీ చేస్తుండగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు పరారయ్యారు.

వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకొని కార్లను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నిందితుడిని విచారించగా పెనుపహాడ్ మం డలానికి చెందిన నూనవత్ జగన్, మంచ్యానాయక్ ప్రోద్బలంతో హైదరాబాద్, దేవ రకొండ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిం దితులు నూనవత్ జగన్, నూనవత్ మం చ్యానాయక్, ఆంగోతు  నాగరాజు, బానోతు సాయిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించినట్టు చెప్పారు.