30-06-2025 02:29:13 AM
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టుఫైండ్స్ను 15 శాతం పెంచుతున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటిస్తూ జీవో 90ను విడుదల చేసింది. ఈ పెంపుతో ఇంటర్న్లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్టియర్లో రూ.67,032, సెకండియర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,782 చొప్పున స్టుఫైండ్ అంద నుంది.
సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్టియర్లో రూ.1,06,461, సెకండియర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున స్టుఫైండ్ అందనుంది. సీనియర్ రెసిడెండ్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు జీవోలో పేర్కొన్నారు. పెంచిన స్టుఫైండ్స్ను ఇకపై ప్రతినెలా 10వ తేదీన చెల్లించాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టుఫైండ్ చెల్లించేందుకు అవసరమైన బీఆర్వోను (బడ్జెట్ రిలీ జ్ ఆర్డర్) అధికారులు విడుదల చేశారు. పెం డింగ్ స్టుఫైండ్ బకాయిలను కూడా ప్రభు త్వం విడుదల చేసింది. సోమవారం జూడా ల ఖాతాల్లో స్టుఫైండ్ డబ్బులు జమ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాం ట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇతర సిబ్బం ది ఉద్యోగ కాలాన్ని మరో ఏడాది పాటు పెంచుతూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. దీంతో వీరికి రెగ్యులర్ వేతనాలు చెల్లించేందుకు మార్గం సుగమం అయింది.
సమ్మె విరమణ
సమస్యల కోసం జూన్ 30 నుంచి సమ్మె బాట పడుతున్నట్లు నోటీసులు ఇచ్చిన జూ నియర్ డాక్టర్లు, సకాలంలో స్టుఫైండ్ చెల్లించడం లేదంటూ జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పిన సీనియర్ రెసిడెంట్లు తమ సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించినందుకు జూడాలు ఆదివారం రాత్రి మం త్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమ్మెను విరమిస్తు న్నట్లు జూడాల రాష్ట్ర అధ్యక్షుడు డా. జె ఇసాక్ న్యూటన్ వెల్లడించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని తమ డిమాండ్లను పరిష్కరించారని ఆయన పేర్కొన్నారు.