30-06-2025 02:29:42 AM
కామారెడ్డి, జూన్ 29(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ లలితా త్రిపుర సుందరీ ఆలయం లో వారాహి అమ్మవారి వారోత్సవాలు వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుప్త నవరాత్రులు, ఆషాడ వారాహి నవరాత్రులు అత్యంత ఘనముగా కనుల పండుగ ఆదివారం నిర్వహించారు. గత గురువారం నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
కామారెడ్డి లోని ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారి వైదిక మంత్రముల మధ్య విశేష పంచామృత అభిషేకము, అలంకరణ, కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. భక్తులందరి జయ జయ ధ్వనాల మధ్యచక్కగా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినీలు వరహాయిని మాత వేషధారణలో చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అర్చకులు సతీష్ పాండే, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.