calender_icon.png 6 June, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

03-06-2025 12:58:43 AM

హుజురాబాద్,జూన్2:(విజయ క్రాంతి) హుజురాబాద్ ఏసిపి మాధవి. హుజరాబా ద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం మున్సిపల్ కమిషనర్ సమ్మ య్య ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలత నగరాలుగా అభివృద్ధి చేయుటకు 100 రో జుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాధవి 2కె రన్ ని జెండా ఊపి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ సమిష్టిగా పరి సరాలను పరిశుభ్రతను పాటించాలని సూ చించారు. రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు..

టూ కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కరుణాకర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, పురపాలక సంఘం మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సాంబరాజు తోపాటు క్రీడాకారులు పట్టణవాసులు పాల్గొన్నారు.