06-06-2025 12:55:23 AM
- పూర్తయిన హుస్నాబాద్ ఇందుర్తి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులు
- నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్
కరీంనగర్, జూన్ 6 (విజయ క్రాంతి): హుస్నాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు తొలగనున్నాయి. గుంతల మ యమై మట్టికొట్టుకుపోయిన సింగిల్ లేన్ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రయాణీకులు ఇకపై డ బుల్ రోడ్డుపై హాయిగా ప్రయాణించే అవకాశం కలిగింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల సంస్థ హుస్నాబాద్ ఇందుర్తి సింగిల్ లేన్ మట్టిరోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించింది. మొత్తం రూ.24 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలకు 2022 డిసెంబర్ లో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన విషయం తెలిసిందే.
కేంద్ర రహదారుల మౌలిక సదుపా యాల నిధి(సీఆర్ఐఎఫ్) కింద నిధులు విడుదలయ్యాయి. 15 నెలల వ్యవధిలో ఈరోడ్డు ను నిర్మించాలని ఒప్పందం కుదిరింది. 2024 మార్చిలో డబుల్ రోడ్డు పనులు ప్రా రంభమయ్యాయి. నిర్ణీత వ్యవధిలోపే డబుల్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయ డం విశేషం. హుస్నాబాద్ ఇందుర్తి డబుల్ రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపు 12.05 కిలోమీటర్ల పొడువునా నిర్మాణ పనులను పూర్తి చేశారు.
ఇందుర్తి నుండి నవాబుపేట, కొండాపురం, అరెపల్లి, పొట్లపల్లి గ్రామాల మీదుగా హుస్నాబాద్ వరకు ఈ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా 22 పైప్ కల్వర్టులను పునర్నించారు. రోడ్డు పక్కనున్న బావులకు రక్షణ గోడలను సైతం నిర్మించారు. నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకోవడంతో కేంద్ర మం త్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం హు స్నాబాద్ఇందుర్తి రోడ్డును ప్రారంభించనున్నారు. హుస్నాబాద్ఇందుర్తి సింగిల్ రోడ్డు ను డబుల్ రోడ్డుగా మార్చేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమా ర్కు ప్రజలు కృతజ్ఞతలుతెలియజేశారు.