06-06-2025 12:58:17 AM
ఏండ్ల కల సాకారం కానుంది. ఉగ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న జమ్మూలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ‘చినాబ్ రైల్వే వంతెన’ ప్రారంభం కానుంది. ఈ వంతెన ఎత్తు ఎత్తున కట్టడం ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండనుంది. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో జమ్మూ-శ్రీనగర్ల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
దట్టమైన పర్వతాల నడుమ చినాబ్ నదిపై 1.31 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న జమ్మూవాసుల కల నేటితో నెరవేరనుంది. జమ్మూలోపల తొలి వందేభారత్ ఈ బ్రిడ్జిపై ‘చికుబుకు..చికుబుకు’ అని పరుగులు పెట్టనుంది.
శ్రీనగర్, జూన్ 5: జమ్మూ వాసులు ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న కలలు నేడు సాకారం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మిం చిన చినాబ్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. ఈఎసందర్భంగా కొన్ని ఫొటోలను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
బాంబులతో పేల్చినా ఏం కాకుండా..
చినాబ్, అంజి బ్రిడ్జిల ప్రారంభంతో ప్రతిష్టాత్మక ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్)లో కీలక ముం దడుగు పడనుంది. జమ్మూలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా కానీ ఈ బ్రిడ్జిల సాయంతో రైల్వే నెట్వర్క్ నిరంతరాయంగా సేవలందించనుంది. శత్రువులు బాంబులు పెట్టి బ్రిడ్జిని పేల్చినా కానీ ఆ దాడిని సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీన్ని నిర్మించారు.
ఏండ్ల నిరీక్షణకు తెర..
అత్యంత ఎత్తయిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఏం డ్లుగా కొనసాగుతోంది. బ్రిటీష్ కాలంలోనే శివాలిక్ పర్వతాలను కలుపుతూ కశ్మీర్ లోయలో రైలు నడపాలని భావించారు. భావించడంతో పాటుగా ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను కూడా నియమించారు. అయినా కానీ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. 2002లోనే అటల్బిహారీ వాజ్పూయీ ప్రభు త్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఇన్నేండ్లకు ప్రారంభం కానుంది. ఈ బ్రిడ్జి ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా రూపొందించారు. ఈ బ్రిడ్జి మీద నుంచి 100 కిలోమీటర్ల నుంచి రైళ్లు నడిచినా కానీ ఏం కాదు.
అంజి బ్రిడ్జ్ కూడా..
నేడు చినాబ్ బ్రిడ్జితో పాటు భారతదేశ మొదటి కేబుల్ రైల్ బ్రిడ్జి అంజి బ్రిడ్జిని కూడా ప్రారంభించనున్నారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఒమర్ అబ్దుల్లా సమీక్షించారు. అంజి బ్రిడ్జి 473 మీటర్ల పొడవుండ నుంది. దీన్ని చినాబ్ ఉపనది అయిన అంజినదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు కూడా యూఎ స్బీఆర్ఎల్లో భాగమే. దీని నిర్మాణానికి కూడా భారీగా ఖర్చయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నా కానీ దృఢ సంకల్పంతో పూర్తి చేశారు.
జమ్మూకు ఎంతో ప్రత్యేకం
నేటి జమ్మూకశ్మీర్ పర్యటన గురించి ప్రధా ని మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘జమ్మూలో ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెల్లకు జూన్ 6 ఎం తో ప్రత్యేకమైన రోజు. రూ. 46 వేల కోట్ల పైచిలుకు కీలక మౌలిక రంగ ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన జరగనుంది. అక్కడ నివసిస్తున్న వారికి ఇవి ఎంతో మేలు చేయనున్నాయి.’ అని పేర్కొన్నారు. ఈ రెండు రైల్వే వంతెనలతోపాటు మరిన్ని కీలక ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కర్తలో రూ.350 కోట్లతో నిర్మించతల పెట్టిన శ్రీ మాత వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
చినాబ్ వంతెన విశేషాలివే..
పొడవు- 1.31 కిలోమీటర్లు
ఎతు- నదీ గర్భం నుంచి 359 మీటర్లు
ఖర్చు- రూ. 1,486 కోట్లు
వినియోగించిన స్టీల్- 28 వేల టన్నులు
వినియోగించిన బోల్టులు- 6 లక్షలు
బ్రిడ్జి ఆర్క్ పొడవు- 480 మీటర్లు