06-06-2025 12:53:49 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టి కాళేశ్వరం కమిషన్పైనే కేంద్రీకృతమైంది. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు అక్రమాలు, నాసిరకం నిర్మాణాలపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగాయి. అయితే ఇన్నాళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టుతో ప్రత్యక్ష సంబంధమున్న ఇంజినీరింగ్ అధికారులు, ఐఏఎస్లు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు, సాగునీటి రంగ నిపుణులు, స్వచ్ఛం ద సంస్థల సభ్యులను విచారించింది.
అయి తే ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న గత ప్రభుత్వ పెద్దల విచారణ ఇప్పుడు మాజీమంత్రి, మల్కాజిగి రి ఎంపీ ఈటల రాజేందర్తో ప్రారంభమవుతోంది. దీంతో రాష్ట్రంలో అందరి దృష్టి ఈ అంశంపైనే కేంద్రీకృతమై ఉంది. మేడిగ డ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం లో లోపాలు, డిజైన్, నాణ్యత నియంత్రణ, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించిన కమిషన్.. దానికి తగ్గట్టుగా విచారణ చేపట్టనుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా, హరీశ్రావు ఆర్థి క మంత్రిగా పనిచేశారు. అందుకే కమిషన్ వీరిని విచారణకు పిలిచింది. ఇక అన్నీ తానై వ్యవహరించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సైతం కమిషన్ నుంచి పిలు పు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వస్తున్నారు.
అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈటల కేవలం ఆర్థికమంత్రిగా తన విధులు నిర్వర్తించారని.. ప్రాజెక్టు నిర్మా ణ విషయంలో ఆయన పాత్ర పెద్దగా ఉండదని, కాబట్టి ఈ విచారణ వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఆర్థికమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీశ్రావు విచారణ చాలా కీలకంగా ఉంటుందని అంటు న్నారు.
హరీశ్రావు జూన్ 9న విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అధికార పార్టీ సైతం ఈ అంశం పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కమిషన్ అడిగే ప్రశ్నలకు వీరు ఎలాంటి సమాధానాలు చెబుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈటల, హరీశ్ విచారణ తర్వాత పరిణామాలను గమనించిన తర్వాత తాను విచారణకు హాజరయ్యేందుకు కాస్త వెసులుబాటు ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ భావించే గడువు (జూన్ 11) తీసుకున్నారని చర్చ జరుగుతోంది.
ఈటల, హరీశ్, కేసీఆర్ వరుసగా విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి వీరిపైనే ఉంది. కమి షన్ ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారిం చి.. బరాజ్ల నిర్మాణ సంస్థలు, ఇంజినీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను పరిశీలించింది.
అధికారులు తమ వాం గ్మూలంలో కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. జూన్ 30 నాటికి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దీంతో వీరి ముగ్గురి వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవడానికి కమిషన్ నోటీసులు జారీ చేసింది.