calender_icon.png 26 June, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి ఎస్సై

26-06-2025 12:00:00 AM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రాంచందర్

కల్వకుర్తి, జూన్ 25: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై రాం చందర్ స్టేషన్ బెయిల్ ఇవ్వ డం కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కాడు. గుండూర్ గ్రామానికి చెందిన నంబీ వెంకటయ్య పొలం వద్ద దాయాదుల మధ్య జరిగిన పంచాయితీలో కేసు నమోదైంది.

ఈ విషయంలో స్టేషన్ బెయిల్ కోసం ఎస్సై రాంచందర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వెంకటయ్య ఏసీబీని ఆశ్రయిం చాడు. పథకం ప్రకారం బుధవారం రాత్రి ఏడు గంటలకు కల్వకుర్తి స్టేషన్‌లోనే రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.