9 April, 2026 | 6:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

హైదరాబాద్ ఓపెన్ విజేత అమూల్య

22-02-2026 01:10 AM

ముగిసిన అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్

హైదరాబాద్, ఫిబ్రవరి 21: అమెచ్యూర్ గోల్ఫర్స్ కోసం నిర్వహించిన హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ ఉత్సాహంగా ముగిసింది. మహిళా గోల్ఫర్ అమూల్య ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ సం యుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా అమెచ్యూర్ గోల్ఫర్లు పాల్గొన్నారు. పోటీలు ఆద్యంతం హో రాహోరీగా సాగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగింపు వేడుకలకు హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

గోల్ఫ్‌కు హైదరాబాద్ చిరునామాగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రీడ ద్వారా తెలంగాణ టూరిజం కూడా అభివృద్ధి చెందు తోందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టోర్నీని నిర్వహించిన టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డిని గవర్నర్ అభినందించారు. హైదరాబాద్ ఓ పెన్ శ్రేష్ఠత, క్రమశిక్షణ మరియు భారతదేశంలో ఔత్సాహిక గోల్ఫ్ యొక్క పెరుగుతు న్న వేగానికి శక్తిమంతమైన సాక్ష్యంగా నిలుస్తుందనీ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు.