22-02-2026 01:10:36 AM
ముగిసిన అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్
హైదరాబాద్, ఫిబ్రవరి 21: అమెచ్యూర్ గోల్ఫర్స్ కోసం నిర్వహించిన హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ ఉత్సాహంగా ముగిసింది. మహిళా గోల్ఫర్ అమూల్య ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ సం యుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా అమెచ్యూర్ గోల్ఫర్లు పాల్గొన్నారు. పోటీలు ఆద్యంతం హో రాహోరీగా సాగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగింపు వేడుకలకు హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
గోల్ఫ్కు హైదరాబాద్ చిరునామాగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రీడ ద్వారా తెలంగాణ టూరిజం కూడా అభివృద్ధి చెందు తోందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టోర్నీని నిర్వహించిన టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఎన్ఆర్ఎన్ రెడ్డిని గవర్నర్ అభినందించారు. హైదరాబాద్ ఓ పెన్ శ్రేష్ఠత, క్రమశిక్షణ మరియు భారతదేశంలో ఔత్సాహిక గోల్ఫ్ యొక్క పెరుగుతు న్న వేగానికి శక్తిమంతమైన సాక్ష్యంగా నిలుస్తుందనీ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి చెప్పారు.