05-12-2025 01:33:38 AM
మర్రిగూడ, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని‘ ప్రచారాలతో కాదు.పనులతో చూపించే నాయకత్వం వహిస్తారని మీకు మాటిస్తున్నాను అని తిమ్మడపల్లి గ్రామ సర్పంచ్ సిపిఐ అభ్యర్థి సేలం పాండురంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘మన గ్రామం మన గౌరవం... నాకు ఒక్క అవకాశం ఇచ్చి మన గ్రామ అభివృద్ధి బాధ్యత నాపై వదలండి అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మీరు వేసే ఓటు - మన ఊరికి బంగారు బాట , పల్లె నన్ను గెలిపిస్తే - నేను పల్లెను గెలిపిస్తా , ప్రపంచానికి చూపిస్తా.. గెలుపే లక్ష్యం అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్న అన్నారు. తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ సీపీఐ అభ్యర్థిగా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేశారు చెల్లం పాండురంగారావు.