10 June, 2026 | 3:56 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పర్సంటేజీ ఇవ్వకుంటే థియేటర్లు మూసేస్తాం

11-04-2026 12:00 AM

సినిమా థియేటర్లలో రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సంటేజీ సిస్టమ్‌ను అమలు చేస్తూ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఇటీవల నిర్ణయం ప్రకటించడం, పర్సంటేజీ విధానానికి తాము వ్యతిరేకమని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించడం తెలిసిందే. గతంలో అద్దె ప్రాతిపదికన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగేవి.

మల్టీప్లెక్స్‌ల తరహాలోనే హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లు పర్సంటేజీ విధానంలో సినిమాలన ప్రదర్శించాలంటూ ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇటీవల ప్రకటన వెలువరించిది. మరోవైపు పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఫిల్మ్ ఛాంబర్ చెబుతోంది.

ఇతర రాష్ట్రాల్లో పర్సంటేజీ విధానమే అమలవుతోందని వెల్లడించింది. నిర్మాతల గిల్డ్ ప్రకటనపై తాజాగా మరోమారు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. తమ నిర్ణయాన్ని కాదని నిర్మాతల గిల్డ్ ఎలా స్పం దిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఏప్రిల్ 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పర్సంటేజీ ఇవ్వకుంటే మే 1వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ థియే టర్లు మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సంఘం వెల్లడించింది.