సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు
10-06-2026 02:21 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన పొన్నమనేని రంజిత్ రావు ను బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత, ఉస్తేం రవీందర్, యువ నేత పురం రమణ, లంక శంకర్ తదితరులు మర్యాదపూర్వకంగా తన చాంబర్లో కలిసి బోకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కారం చేస్తారని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గంజాయి వంటి భయంకరమైన మత్తుపదార్థాలపై నిఘా ఏర్పాటు చేసి నిర్మూలించాలని కోరారు. యువత సన్మార్గంలో నడిచేందుకు పలు అవగాహన కార్యక్రమాలను చేయాలని కోరారు.






