20-06-2025 12:00:00 AM
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తొట్ల మల్లేష్, చింతకింది మధుసూదన్
మంచిర్యాల, జూన్ 19 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సం ఘాన్నివిచ్ఛిన్నంచేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తొట్ల మల్లేష్, చింతకింది మధుసూదన్ తెలిపారు. గురువారం నస్పూ ర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..
గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులసమస్యలపై సంఘం తరపున అనేక పోరాటాలు చేస్తున్నామని, కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 14న వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్స్లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా మూడో మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాజశేఖర్లు జిల్లా కమిటీని ప్రకటించారని, జిల్లా ఇంచార్జ్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య ఉండగా, రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, సన్నాహక కమిటీల పేరిట సంఘాన్ని విభజించే ప్రయ త్నం చేస్తూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
త్వరలో రాష్ట్ర కమిటీ పత్రికా ముఖంగా పూర్తి వివరా లు తెలియజేస్తుందన్నారు. సంఘాన్ని విచ్ఛి న్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, సం ఘం బలోపేతానికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె లక్ష్మణ్, అరికిళ్ల జీవన్ బాబు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోపతి సత్తయ్య, తిరుపతి పాల్గొన్నారు.