calender_icon.png 20 June, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు బాసటగా రైతు భరోసా

20-06-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, జూన్ 19 (విజయక్రాంతి): వానాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం క్రమంగా రైతులకు నిధులు అందజేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం నాటికి నిర్మల్ జిల్లా లో మొత్తం రూ.156.95 కోట్ల రైతు భరోసా నిధులు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు.

జిల్లాలో ఉన్న మొత్తం 1,86,400 మంది రైతుల్లో 1,54, 195 మంది ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నిధులు చేరాయని వివరించారు. మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమ కానున్నట్లు తెలిపారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.

ఈ పథక ప్రయోజనమని పేర్కొన్నారు. చివరి గుంట భూమి వరకు రైతులకు రైతు భరోసా అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ స్పష్టంచేశారు. పంట ప్రారంభానికి ముందే నిధులు జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.