20-06-2025 12:00:00 AM
లక్షేట్టిపేట, జూన్ 19: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ( ఫుల్ ట్యాంక్ లెవెల్ ) నిర్ధారణ పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. గురు వారం కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేర కు ఇరిగేషన్ ఏఈ ప్రణీత్, తహసీల్దార్ దిలీప్ కుమార్ తో పాటు మున్సిపల్ సిబ్బంది ఎఫ్టీఎల్ హద్దు రాళ్ళ ఏర్పాటు పనులను పర్యవే క్షించారు.
సుమారు 100 వరకు బండరాళ్ళ ను ఇరిగేషన్ శాఖ నిర్ధారించిన ప్రాంతంలో మున్సిపాలిటీ సిబ్బంది గుంతలు తవ్వి హద్దు రాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, స్థానిక మత్స్యకారులకు, రైతులకు ఇరిగేషన్ శాఖ సమాచారం ఇవ్వకుండానే ఎఫ్టీఎల్ హద్దులు ఎలా నిర్ణయిస్తారని చెరువు పరిరక్షణ సమితి కన్వీనర్ సప్ప రవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మేడి నారాయ ణలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ డీఈ కుమార్ పేర్కొన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోని పట్టా భూముల సర్వే నంబర్స్ నేడు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా లేకుండా పోతున్నా యో అధికారులు సమాధానం చెప్పాల్సిన రోజు త్వరలోనే వస్తుందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, ఎఫ్టీ ఎల్ నిర్ధారణ, హద్దురాళ్ళ ఏర్పాటు వివరాల కోసం ఇరిగేషన్ ఇంచార్జ్ ఏఈఈ ప్రణీత్ ను మీడియా ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు. పూర్తి స్థాయిలో ఎఫ్ టీ ఎల్ హద్దు రాళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంకా కొనసాగనుంది.