30-11-2024 09:04:32 PM
ఎస్పీ సింధూశర్మ..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 1 నుండి 7 వరకు జిల్లా వ్యాప్తంగా 30 (30)ఏ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సింధూశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.