16 March, 2026 | 3:09 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

కూకట్‌పల్లిలో 'ఫ్రీడం పార్క్' ప్రారంభం..

07-11-2024 05:50 PM

కూకట్‌పల్లి (విజయక్రాంతి): పార్కులు పచ్చదనానికి ప్రతీకలుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెమిని ఎడిబుల్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి బాలాజీ నగర్ లో జిఈఎఫ్ ఇండియా కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఫ్రీడం పార్క్ ని 2.76 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు వారాంతంలో కాకుండా ప్రతిరోజు ఆహ్లాదం కోసం పార్కులకు వచ్చేందుకు వారికి కావలసిన సదుపాయాలని కల్పించడం జరిగిందన్నారు.

చిన్నారుల కోసం ప్రత్యేకంగా రంగురంగుల స్వింగ్ లతో కూడిన ఆట పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పార్కులో గ్రీనరీతో పాటు ఆట పరికరాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించి పార్కులను సుందరీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కాంక్రీట్ జంగల్ గా మారిన నగరంలో కాస్తంత ఉపశమనం పొందేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిహెచ్ఎంసి భాగస్వామ్యంతో పార్కును మరింత సుందరీకరించి ఇక్కడి ప్రాంత ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.