16-12-2025 01:00:00 AM
రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
సిర్పూర్లో 7.6 డిగ్రీలు
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో శీతలగాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే సోమవారం రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.6 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.