05-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 4: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం పొందిన పాకిస్థాన్కు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కూడా 800 మిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజ్ మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. కాగా ఈ రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ మంజూరు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ నిధులను పాకిస్థాన్ సైనిక వ్యయం కోసం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
మేలోనే పాకిస్థాన్ ఐఎంఎఫ్ 1 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. ఆ రుణ మంజూరు సమయంలో కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా కానీ ఐఎంఎఫ్ ముందుకు సాగింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేస్తామని గతంలో ఏడీబీకి హామీనిచ్చిన పాక్ ఆ హామీని ఎంతమేర నెరవేర్చిందని ప్రశ్నించింది. భారత్ అభ్యంతరాలపై ఏడీబీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.