calender_icon.png 26 June, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌సీఓ పత్రంపై సంతకం చేయని రాజ్‌నాథ్‌ సింగ్‌

26-06-2025 02:04:59 PM

  1. శాంతి, శ్రేయస్సు, ఉగ్రదవాదం కలిసి ఉండలేవు: రాజ్ నాథ్ 
  2. ఉగ్రవాదాన్ని సహించేది లేదు: రాజ్ నాథ్ సింగ్
  3. ఎస్ సీవో వేదికగా హెచ్చరిక చేసిన భారత్

చైనా: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Minister Rajnath Singh) ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో(Shanghai Cooperation Organization Summitరాజ్‌నాథ్ సింగ్ గురువారం పాల్గొన్నారు.  ఉగ్రవాదులు, వారి మద్దతుదారులకు ఎస్‌సీఓ వేదికగా భారత్ గట్టి హెచ్చరిక చేసింది. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. షాంఘై సహకార సంస్థ సదస్సు ఉగ్రవాదంపై సంయుక్త ప్రకటన చేసింది. సంయుక్త ప్రకటనలో పహల్గాం ఉగ్రదానికి చేర్చకపోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌సీఓ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ఉండలేవని రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని రాజ్‌నాథ్ సింగ్‌ పిలుపునిచ్చారు.

కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని విధానంగా మార్చుకున్నారని పేర్కొన్నారు. స్వార్థప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని అస్త్రంలా వాడుతున్నారు.. ఉగ్రవాదాన్ని అస్త్రంలా వాడేవారు పర్యావసనాలు అనుభవించాలని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని(Terrorism) సహించేది లేదని భారత్ తన చర్యలతో స్పష్టం చేసిందని ఆయన  తేల్చిచెప్పారు. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యం చేసుకునేందుకు వెనుకాడబోమని నిరూపించామని భారత రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. 2025 పహల్గామ్ దాడి అనేది భారత పరిపాలనలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన ఉగ్రవాద దాడి, దీనిలో 22 ఏప్రిల్ 2025న 26 మంది పౌరులు మరణించారు. ఉగ్రవాదులు ప్రధానంగా హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు, అయితే ఒక క్రైస్తవ పర్యాటకుడు, ఒక స్థానిక ముస్లిం కూడా మరణించారు.