calender_icon.png 2 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

02-09-2025 12:33:30 AM

ధరల నియంత్రణ సమావేశం ద్వారా అధిక ధరలు పెంచకుండా చూడాలి

మండల ప్రత్యేక అధికారులు డైలీ టూర్ డైరీ సమర్పించాలి

ట్రాక్టర్ ఇసుక రవాణకు 1500 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలి

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెరగాలని, ప్రతి మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మండలాల వారిగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, మార్కింగ్ చేసిన ఇండ్లు, నిర్మాణం జరుగుతున్న ఇండ్లు, వాటి పురోగతి వివరాలను మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్  ఝా మాట్లాడుతూ... సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం 8 వేల 811 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా,  5292 ఇండ్ల మార్కింగ్ జరిగిందని, 2921 ఇండ్లు బేస్మెంట్ స్థాయికి, 146 గోడల దశ వరకు, 451 ఇండ్లు రూఫ్ వరకు 1ఇంటి నిర్మాణం పూర్తి జరిగాయని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు నియంత్రణలో ఉండేలా మండల స్థాయి ప్రైస్ కమిటీ ద్వారా ధరలు నియంత్రించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ తరఫు నుంచి ఆర్థిక సహాయం సకాలంలో అందేలా అధికారులు చూడాలని, మన దగ్గర పెండింగ్ ఉండకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇసుక తీసుకెళ్ళెందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని, జిల్లాలో ఎక్కడైనా 1500 కంటే ఎక్కువ ట్రాక్టర్ ఇసుక సరఫరా కోసం వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మోడల్ స్కూల్స్ లను, అంగన్వాడీ సెంటర్స్,పి. హెచ్ సి, ఎరువుల షాప్స్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యా సంస్థల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉన్నాయా, నీరు నిల్వ ఉంటుందా, విద్యార్థులకు అందించే ఆహార, త్రాగునీటి నాణ్యత, ఎలా ఉంది వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులు డైలీ టూర్ డైరీ సమర్పించాలని ఆదేశించారు.