21-06-2025 12:00:00 AM
గొప్ప నాయకున్ని కోల్పోవడం బాధాకరం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
అదిలాబాద్, జూన్ 20 ( విజయ క్రాంతి) : నిత్యం పార్టీ బలోపేతం కోసం శ్రమించిన ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూం గుండెపోటుతో మృతి చెందటం బాధాకరమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అబ్దుల్ ఖయ్యూం గుండెపోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఉట్నూర్ మండల కేంద్రంలోని వారి ఇంటికీ వెళ్ళి పార్థివదేహంపై కాంగ్రెస్ జెండాను కప్పి నివాళులు అర్పించారు.
అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ చిరునవ్వుతూ పలకరించే స్వభావం అబ్దుల్ ఖయ్యూందని, అనునిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకునే నాయ కుడన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలు మరవలేనివన్నారు.
నేడు కాంగ్రె స్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. అనంతరం తండ్రి మరణ వార్త విని స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ ఖ య్యూం కుమారుడు ఫహీం ను ఎమ్మెల్యే పరామర్శించి, మనో ధైర్యం కల్పించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.