07-06-2025 05:13:49 PM
బిజెపి జిల్లా కార్యదర్శి బోడిగ అశోక్ గౌడ్..
చండూరు (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లు అనర్హులను తొలగించి, నిరుపేదలైన అర్హులకు ఇవ్వాలని బిజెపి జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్(BJP District Secretary Bodige Ashok Goud) అన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్, మండల శాఖల ఆధ్వర్యంలో స్థానిక శీలా అనసూయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లల్లో అర్హులైన పేద ప్రజలకు కాకుండా కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టారీతిన అనర్హులకు ఇండ్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిస్టులను మరలా రీ వెరిఫై చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులు గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తి లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల మున్సిపల్ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు,పందుల సత్యం గౌడ్, రాష్ట్ర ఓబిసి మోర్చ అధికార ప్రతినిధి కోమటి వీరేశం, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి, భూతరాజు శ్రీహరి, జిల్లా నాయకులు ఇరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పడసనబోయిన శ్రీను, భూతరాజు స్వామి, సోమ శంకర్, ఆవుల అశోక్ యాదవ్, పార్టీ ఉపాధ్యక్షులు కోమటి ఓంకారం, జెట్టి యాదయ్య, నలపరాజు యాదగిరి, చెనగాని శేఖర, పల్లెగోని చంద్రమౌళి,పార్టీ కార్యదర్శి దాసరి శంకర్, ఇరిగి శివ, బూతురాజు వేణు, కోశాధికారి మంచుకొండ సాగర్, నల్ల శ్రీను, కార్యవర్గ సభ్యులు మర్ల రమేష్, గుండెల యాదగిరి, దాసరి సైదులు, రామరాజు, బూత్ అధ్యక్షులు చిట్టిపోలు వెంకటేశం, చెరుపల్లి కృష్ణ, గన్నవరం నాగరాజ, పున్నా అరుణోదయ, నలపరాజు సత్తయ్య, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.