calender_icon.png 7 June, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగేష్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి

07-06-2025 05:16:08 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..

చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): నగేష్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Members Banda Srisailam) అన్నారు. శనివారం గట్టుప్పల మండల కేంద్రంలో నగేష్ నివాసం వద్ద సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగేష్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు.

కార్మిక ఉద్యమంలో భవన నిర్మాణ కార్మికులకు, హమాలీ కార్మికులకు, టై అండ్ డై యూనియన్ వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి వారికి అండగా నిలిచిన వ్యక్తి నగేష్ అని ఆయన అన్నారు. గట్టుప్పల గ్రామంలో అన్ని రంగాల కార్మికుల కోసం గ్రామపంచాయతీ వర్కర్స్, ఇతర కార్మిక రంగాలలో వారి హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించారని ఆయన అన్నారు. గత 15 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ సభ్యుడుగా అనేక ఉద్యమాలలో పనిచేశారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాల కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు నిర్వహించాలని, అప్పుడే నగేష్ కు నిజమైన నివాళులు అర్పించడం అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, గట్టుపల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఎండి రబ్బాని, అచ్చిన శ్రీనివాస్,పగిళ్ల శ్రీనివాస్, ఖమ్మం రాములు, కర్నాటి వెంకటేశం, పగిళ్ల బిక్షం, ఏర్పుల సైదులు,పెదగాని నరసింహ, ఖమ్మం రాములమ్మ, ముస్కు బుచ్చిరెడ్డి, వడ్డేపల్లి లక్ష్మయ్య, ఈరటి వెంకటయ్య, కర్నాటి యాదయ్య, గుమ్మకొండ యాదిరెడ్డి, నల్లవెల్లి బిక్షం, మొద్దు గాలయ్య, పసుపుల చిన్నయ్య, గుంటోజు విశ్వనాథం, వడ్డేపల్లి లక్ష్మయ్య, హమాలి సంఘం నాయకులు దుబ్బాక శంకర్, బొబ్బల చంద్రయ్య,నగేష్ కుటుంబ సభ్యులు పార్వతమ్మ, కకునూరి రాము, తదితరులు పాల్గొన్నారు.