calender_icon.png 17 June, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలైన అర్హులకే ఇవ్వాలి

16-06-2025 05:01:50 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..

చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలైన అర్హులకే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) అన్నారు. సోమవారం గట్టుపల మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వకుండా, అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో నిరుపేదలైన కొంతమందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తూ, కాంగ్రెస్ నాయకుల హనుమాయులకు, వారి కార్యకర్తలకే ఇండ్లు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిబంధన ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరి కూడా ఇండ్లు కేటాయించలేదని ఆయన అన్నారు.

గతంలో రైతు భరోసా పెండింగ్లో ఉన్నటువంటి వారికి, 2025 ఖరీఫ్ సీజన్ రైతు భరోసా రైతు ఖాతాలోని జమ చేయాలని ఆయన అన్నారు. రుణమాఫీ కానటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసి తిరిగి పంటలు ఇవ్వాలని ఆయన అన్నారు. కొత్త పాసుబుక్ కలిగిన రైతాంగానికి నాబార్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా రుణం పరిమితిని పెంచి రైతులకు పంట రుణాలు అందించాలనిఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, అచ్చిన శ్రీనివాస్, ఎండి రబ్బాని, పెద్దగాని నరసింహ, రావుల నరసింహ, తెలుసూరి సైదులు, ముసుకు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.