5 July, 2026 | 3:36 PM

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

05-07-2026 02:53 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి, గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మేడిగడ్డ బ్యారేజీకి 90,580 క్యూసెక్యులు ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై బ్యారేజీ దెబ్బతిన్నప్పటి నుంచే 85 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా కొనసాగగా, 62,700 క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతోంది.