09-04-2025 02:11:33 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 ( విజయ క్రాంతి ) : ఇల్లు లేని నిరుపేదలు కాలి స్థలం కలిగి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట లేని వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వాలని కోరుతూ టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ కౌన్సిలర్ పడిగల రేణుక ప్రదీప్ జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాలి స్థలం కలిగి ఉండి సొంత ఇల్లు నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్న నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అందరికీ వర్తింపచేయాలని కోరారు.
కాలి స్థలం ఉన్న వాళ్లంతా డాక్యుమెంట్ పేపర్స్ ఉండాలని మున్సిపల్ అధికారులు చెప్పడంతో నిరుపేదలంతా ఆందోళన గురవుతున్నారని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ప్రజా ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ స్థలాలు ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. వారందరికీ డాక్యుమెంటేషన్ లేకున్నా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపచేయాలని కోరారు.