09-04-2025 02:12:48 AM
తుంగతుర్తి, ఏప్రిల్ 8 : ఇటీవల అనారోగ్యంతో మరణించిన తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంపటి మాజీ సర్పంచ్ దాయం విక్రమ్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మందుల సామెల్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.మండల పరిధిలోని వెంపటి గ్రామంలో విక్రమ్ రెడ్డి నివాసానికి వెళ్లి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి ని ఆమే కుటుంబాన్ని ఓదార్చారు.
ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్,తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, జిల్లా నాయకులు సుంకరీ జనార్ధన్, పసుల అశోక్ యాదవ్, పేరాల వీరేష్, జుమ్మిలాల్, భాష బోయిన వెంకన్న తదితరులు ఉన్నారు.