06-06-2025 12:57:31 AM
సిరిసిల్ల, జూన్ 5 (విజయక్రాంతి):ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్ధిదారులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేయగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. మంజూరు పత్రాలు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందనివివరించారు.