calender_icon.png 7 June, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలి

06-06-2025 12:55:36 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్

ఎల్బీనగర్, జూన్ 5 : ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని జి ల్లా న్యాయ సేవాధికార సంస్థ, రంగారెడ్డి జి ల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ కర్ణ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవ సంస్థ, రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ సం యుక్తంగా గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుక లు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ మాట్లాడుతూ... ‘పర్యావరణ పరిరక్షణ మన సమా జానికి అత్యంత అవసరమన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నా టటం, పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పర్యావరణాన్ని రక్షిం చడం అనేది మనందరి బాధ్యత అని, అం దుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం పెంపొందించడం, జల వనరుల ను సరిగ్గా వినియోగించడం తదితర చర్యలు తీసుకోవాలని కోరారు. మనం ప్రకృతి సహజ వనరులు, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ..

పర్యావరణ పరిరక్షణలో మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేయాలని, ఇదీ భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమని తెలిపారు. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... ‘నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాం కేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్ర పంచవ్యాప్తంగా పరిశ్రమలను స్థాపించి, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాడని తెలిపారు.

పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ బ్యాగుల వినియో గం వీలైనంతవరకు తగ్గించాలని, షాపింగ్ కి వెళ్ళేప్పుడు క్లాత్ బ్యాగ్ ని తీసుకువెళ్లాలని సూచించారు.

అనవసరంగా నీరు వృథా చేయొద్దని, ఇంట్లో టాప్స్ లీకేజ్ లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని, నిల్వ నీటిని వృథాగా పారబోసే బదులు మొక్కలకు పోయాలని సూచించారు. కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కక్షిదారులు, ప్యారా లీగల్ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ సంరక్షణ మనందరి బాధ్యత: - హయత్ నగర్ కోర్ట్ ప్రాంగణం లో మొక్కలు నాటిన న్యాయమూర్తి నర్మద హయత్ నగర్ కోర్టు ప్రాంగణం లో కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యు లు మొక్కలను నాటారు. కార్యక్రమంలో జడ్జి సీహెచ్ నర్మద మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని, మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నాటి భవిష్యత్ తరాలకు ఆదర్శనంగా నిలవాలన్నారు. 

కార్యక్రమంలో బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు మోడెమ్ ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మేకల సతీష్, ప్రధాన కార్యదర్శి బండి నరేశ్, సంయుక్త కార్యదర్శి బొడి గ అంజయ్య గౌడ్, కోశాధికారి తూర్పునూర్ ఈశ్వర్ గౌడ్, మహిళా కార్యదర్శి చెరుకు సుమలత, గ్రంథాలయ కార్యదర్శి ఈసారపు సైదులు గౌడ్, క్రీడా కార్యదర్శి సోమపంగు రాజేష్, కార్యవర్గ సభ్యులు వి.శృతి, బి.మే ఘన, కే.గోపి శంకర్, వి.సాయికృష్ణ, ఎస్.జ యసుధ దేవి, సాంబశివుడు, ఎన్.పద్మ, అడ్వకేట్లు, సూపరింటెండెంట్ ధార రాము లు, కోర్టు సిబ్బందిపాల్గొన్నారు.